ఏపీ కరోనా అప్డేట్… కొత్త‌గా 1337 కేసులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి వదలేలా కనిపించడం లేదు. అటు ఏపీలోనూ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1337 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,38,690 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 9 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,070 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 699 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1282 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,09, 921 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 68, 568 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 77, 21, 082 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news