ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 1,365 కేసులు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1365 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,42, 073 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 08 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 097 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13, 796 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1466 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,14, 180 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 56, 720 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 78, 70, 218 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news