బాంబ్ పెట్టి లేపేస్తామని బెదిరిస్తున్నారు : రాజా సింగ్

-

బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా నెంబర్ల నుంచే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని… లేపేస్తం, చంపేస్తాం, బాంబ్ పెడతామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు రాజాసింగ్‌. డీజీపీ మహేందర్ రెడ్డి క్రిమినల్స్ ని పట్టుకుంటున్నామని సోషల్ మీడియాలో, మీడియా లో ప్రమోట్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు.

మరి తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ కు సంబంధించిన నెంబర్లతో సహా పూర్తి వివరాలతో డిజిపి కి ఫిర్యాదు చేశాను.. డీజీపీ ఏం చేస్తారో చూడాలని తెలిపారు. గతంలో కూడా దేశ విదేశాల నుంచి పాకిస్తాన్ , దుబాయ్, ఇదే మాదిరిగా బెదిరింపు కాల్స్ వస్తే డిజిపికి ఫిర్యాదు చేశాను అప్పుడు పట్టించుకోలేదని మండిపడ్డారు.

రాజా సింగ్ కు గన్ లైసెన్స్ ఇవ్వండని సీఎం కేసీఆర్ చెప్పినా… డిజిపి ఇవ్వడంలేదన్నారు. తాను ఎమ్మెల్యే ను, బిజెపి ఫ్లోర్ లీడర్ ను అయినా డిజిపి గన్ లైసెన్స్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. తనపై కేసులు ఉన్నాయని కేసులు ఉంటే గన్ లైసెన్స్ ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. దేశ ద్రోహి అక్బరుద్దీన్ పై ఎన్ని కేసులు ఉన్న కూడా డీజీపీ గన్ లైసెన్స్ ఇచ్చారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news