ఏపీలో కొత్తగా 1502 కరోనా కేసులు, 16 మరణాలు

-

చైనా లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఏపీని వదలేలా లేదు. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,19,702 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,903 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,883 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1525 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 63, 717 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 68, 73, 491 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,90,916 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news