సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్..!

-

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్రకు వన్ డే బ్రేక్ పడింది. రేపు (ఆదివారం) ఈస్టర్ కారణంగా బస్సు యాత్రకు సీఎం జగన్ విరామం ఇచ్చారు. ఈస్టర్ వేడుకల్లో పాల్గొనున్న నేపథ్యంలో జగన్ బస్సు యాత్రకు వన్ డే గ్యాప్ ఇచ్చినట్లు వైసీపీ శనివారం ప్రకటించింది. అనంతపురం జిల్లా శివారులోని సంజీవపురంలో సోమవారం తిరిగి జగన్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఇడుపాయ నుండి ప్రారంభమైన ఈ యాత్ర నంద్యాల జిల్లా మీదు నుండి అనంతపురం చేరుకుంది. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈస్టర్ నేపథ్యంలో రేపు జగన్ విరామం ప్రకటించగా.. సోమవారం నుండి తిరిగి బస్సు యాత్ర రీస్టార్ట్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news