చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు : సీఎం జగన్

-

వైసీపీకి ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు సీఎం వైఎస్ జగన్.  పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. ఫ్యాన్ కి ఓటు వేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్ కి ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం జగన్ మండిపడ్డారు.

బాబు సిట్ అంటే పవన్ సిట్ .. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ అన్నారు. ప్యాకేజీ స్టార్ కి పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి.  చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడని పురాణ కథను గుర్తు చేశారు. జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం అన్నారు.  బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్ అయినా.. యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే అన్నారు.  రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news