నేడు ఉమ్మడి అనంతపురంలో చంద్రబాబు పర్యటన

-

ఇవాళ మార్చి 28,2024 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపూరం జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాలలో ప్రజాగళం పేరిటన ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు చంద్రబాబు.   ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. ఆపై 10:45 నిమిషాలకు ప్రసన్ననాయపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర హెలికాప్టర్ దిగి రోడ్డు మార్గం గుండా 11 గంటలకు రాప్తాడు బస్టాండ్ కు చేరుకోనున్నారు. అక్కడే 12:30 కు బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 2:00 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.

మధ్యాహ్న భోజనం తర్వాత 02:00 నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 02:30 గంటలకు బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ 02:30 నుండి 04:00 వరకు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ సభ తర్వాత 5:10 నిమిషాలకు ప్రసన్నాయపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిగుతారు. ఆ తర్వాత నగరంలోని మహిళా కళాశాల కుడలిలో 05:50 నిమిషాల నుంచి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మదనపల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news