దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితం నాశనం చేయడం తప్పు కాదా..? : సీఎం జగన్

-

దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితం నాశనం చేయడం తప్పు కాదా..? అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. తాజాగా భీమవరం మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ సెటైర్లు వేశారు. దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్ర మైన హామీలిచ్చి తరువాత కార్లు మార్చినట్టు భార్యలను మార్చారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గాలను ఎందుకు వదిలేస్తున్నావ్ అని అడిగా. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ చేస్తే అలవాటు అంటారు.

నిన్ను చరూసి ఇదే తప్పు అందరూ చేస్తే అక్కాచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి అని అడిగా. అందుకే ఆయనకు బీపీ పెరిగిపోయి ఊగిపోతున్నారని పేర్కొన్నారు. విపక్షాలు వేసే బాణాలు జగన్ కు తగులుతున్నాయా..? ప్రజలకు తగులుతున్నాయా..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదు. రాళ్లు వేయండి.. అంతం చేయండి అంటూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. జగన్ వస్తేనే ఇంకా అభివృద్ధి అని ప్రోగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news