గుంటూరులో వైసీపికి షాక్.. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికలు జరుగున్న విషయం తెలిసిందే. అయితే ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నిన్ననే నామినేషన్లు దాఖలు చేసేందుకు కూడా గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా గుంటూరు రాజకీయాల్లో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు.

గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవీ, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం జగన్ కి పంపించారు. వైసీపీ నుంచి తాడికొండ టికెట్ ఆశించిన డొక్కా మాణిక్య వరప్రసాద్ కి నిరాశ ఎదురు అయింది. తాడికొండ నుంచి మాజీ మంత్రి మేకతోటి సుచరిత కి వైసీపీ అవకాశం కల్పించింది.  దీంతో గత కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితోనే ఉన్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు డొక్కా. 

Read more RELATED
Recommended to you

Latest news