టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై పేర్ని నాని ఫైర్..!

-

టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం ప్రస్తుతం ఎన్నికల కోడ్ లో ఉన్నాం.  అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు. కృష్ణా నదిలో, శ్రీశైలం ప్రాజెక్ట్ నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం.  ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి.


సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి. గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు
తరకటూరు, పంపుల చెరువు లోతు 12 అడుగులు. 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది. పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు.  ముందు చూపు లేనిది ఎవరికి..? కొల్లు రవీంద్ర ఏమైనా పనోడా..  కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా.. ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ ఉంది చూసుకో..టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news