ఎల్లుండి కాంగ్రెస్లో చేరుతున్నాం : మేయర్ విజయలక్ష్మి

-

ఊహించినట్టే బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. ఈమేరకు ఆమె ప్రకటన చేశారు. ఎల్లుండి (30న) తామిద్దరం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యల పరిష్కారం సులువు అవుతుందని ఆమె తెలిపారు.

కాగా, ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీనియర్ నేత కె. కేశవరావు భేటీ అయ్యారు .పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు అని తెలుస్తోంది. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు అని మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. అయితే తాను కాంగ్రెస్లోనే చనిపోతానని కేకే చెప్పారు. ఇదిలా ఉంటే కేకే కుమారుడు మాత్రం టిఆర్ఎస్ పార్టీలో ఉంటానని వేరే పార్టీలోకి వెళ్లాలని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news