చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం ఇది : సీఎం జగన్

-

చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం ఇది సీఎం జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరు లో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ మహాజన సముద్రం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఏకంగా రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని తెలిపారు. 

ప్రజలు రెండు సార్లు బటన్ నొక్కి వైసీపీని గెలిపించారు. 58 నెలలుగా చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ఇలా అందరూ అబద్దాలతో బుర్ర కథలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇదే కూటమి 2014లో ఏం చెప్పారో.. ఏం చేశారో మీరే గమనించండి అని ప్రజలను కోరారు. ఎక్కడ వివక్షకు తావు లేకుండా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కి నేరుగా నా అక్కా చెల్లెల్ల కుటుంబానికి అందించామని గుర్తు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news