ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ వస్తుంది : చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. ఇవాళ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు కుప్పం వచ్చినా ఫుల్ జోష్ ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రజల మంచి మనసు కారణంగానే, తాను కుప్పం వస్తే ఆనందం కలుగుతుందని తెలిపారు.

గత 35 ఏళ్లుగా ఏడు పర్యాయాలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ పరంపరను రెన్యువల్ చేయించుకోవడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాను. మళ్లీ గెలిపించమని మీ ఆశీస్సులు కోరుతున్నాను. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఇక్కడ్నించే శ్రీకారం చుడుతున్నాను. రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు మాటిస్తున్నానని, ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేసే బాధ్యత నాది. జలగ చేసే పని.. రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం! నేను అలా కాదు. సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచుతాను. ఆ డబ్బును మీకే పంచుతాను. ఆ డబ్బుతో రూ.15తో రూ.100 సంపాదించే మార్గం నేను నేర్పిస్తాను. రూ.100 నుంచి రూ.1000… రూ.1000 నుంచి రూ. పది వేలు సంపాదించే మార్గం నేను చూపిస్తా.

Read more RELATED
Recommended to you

Latest news