నటుడు జోగినాయుడికి ఏపీ ప్రభుత్వ పదవి

-

జగన్‌ సర్కార్‌ వరుసగా టాలీవుడ్‌ నటులకు కీలక పదవులు అప్పగిస్తూ వస్తోంది. ఈ తరుణంలో టాలీవుడ్‌ నటుడు జోగి నాయుడుకు కీలక పదవి అప్పగించారు జగన్‌. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగినాయుడు నియామకం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా ఎల్. జోగి నాయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఈ మేరకు 17 ఫిబ్రవరి, 2023న జీవో నంబర్ 46 జారీ చేశారు.జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news