రైతులకు శుభవార్త చెప్పే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు

-

రైతులకు శుభవార్త చెప్పే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతులందరికీ బీమా అమలు చేయాలని.. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగాలని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్,ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ బీమా అమలు చేయాలని, విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో మంత్రులు అధికారులను ఆదేశించారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం సూచించిన విధానాల్లో ఉత్తమ విధానం బీమాకు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇక, గత వైసీపీ ప్రభుత్వంలో బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, ప్రీమియం చెల్లింపులు జరగలేదని మండిపడ్డారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరిగేలా బీమా అమలు కావాలని మంత్రులు సూచించారు.వైసీపీ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేయలేదని, తిరిగి ఈ ప్రభుత్వంలో మామిడి రైతులకు బీమా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news