తొలి ఫలితానికి అంకురార్పణ: పోలవరం నుంచి నీటి విడుదల …

-

పోలవరం ప్రాజెక్టులో తొలి ఫలితానికి అంకురార్పణ చేసింది చేసిన ఏపి ప్రభుత్వం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ. పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా డెల్టాకు స్పిల్ వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఈసిఆర్ఎఫ్(ECRF) నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేశారు అధికారులు. అలాగే అప్రోచ్ చానెల్ ద్వారా డెల్టాకు నీటిని విడుదల విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని పాల్గొన్నారు. ENC నారాయణ రెడ్డి పాటు తదితర అధికారులు, మేఘా ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అటు గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేశారు.

నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరికతో పంటలు సశ్యశ్యామలం కానున్నాయి. భారీ వర్షాల సీజన్ లోనే వరద నీటిని మళ్లించడానికి అనుగుణంగా సిద్ధం చేశారు అధికారులు. అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి కావచ్చాయి. గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం కూడా పూర్తి అయింది. 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు రికార్డ్ కానుంది. అతి తక్కువ సమయంలో భారీ పనులు, నిర్మాణాలు పూర్తి చేసి, డెల్టా కు నీరందించే ప్రక్రియను మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news