ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట.. బెయిల్ పిటిషన్ డిస్మిస్..!

-

టీడీపీ  అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. బాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. రూ.300కోట్లకుపైగా స్కిల్‌ స్కామ్‌ వ్యవహారంలో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

 చంద్రబాబు, సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌రింగ్‌రోడ్‌, అంగుళ్లు కేసు వ్యవహారంలో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై కీలక వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news