ఇండియాకు షాక్: శుబ్మాన్ గిల్ రెండవ మ్యాచ్ కూ దూరం.. ఇలా అయితే కష్టమే !

-

వన్ డే వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ను ఆడిన ఇండియా విజయాన్ని అందుకుని సంతోషంగా తరువాత మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. నిన్న మ్యాచ్ లో కోహ్లీ మరియు రాహుల్ లు ఇండియా పరువులు కాపాడే ఇన్నింగ్స్ తో అదరగొట్టారు. కాగా ఇండియా తమ తర్వాత మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది. అయితే తాజాగా టీం యాజమాన్యం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కు కూడా ఓపెనర్ బ్యాట్స్మన్ శుబ్మాన్ గిల్ దూరం కానున్నాడు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న గిల్ కొంచెం కొంచెం కోలుకుతున్నదని బీసీసీఐ తెలిపింది. ఇక మొదటి మ్యాచ్ లో గిల్ లేకపోవడంతో కేవలం రెండు పరుగులకే జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

గిల్ త్వరగా కోలుకుని జట్టులో చేరితే ముందు ముందు ఇంకా కఠినమైన మ్యాచ్ లు ఉన్నందున ఇబ్బందిలేకుండా ఉంటుంది. లేకపోతే… అన్ని సార్లు కోహ్లీ రాహుల్ లు ఆదుకోలేకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news