అమెరికాలో ప్రమాదం.. ఏపీకి చెందిన ఇచ్చాపురం వాసి మృతి

-

విదేశాల్లో విద్యను అభ్యసించి, జీవితంలో స్థిరపడేందుకు దేశం దాటిన చాలా మంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో విగతీజీవులుగా మారుతున్నారు. కొందరు అగంతకుల చేతిలో హతులు అవుతుంటే మరికొందరు ఎంజాయ్ కోసం అని వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు.తాజాగా ఏపీకి చెందిన విద్యార్థి సైతం ఉన్నత చదువుల కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

 

శ్రీకాకుళం(డి)ఇచ్చాపురానికి చెందని రూపర్ రెడ్డి (26) అమెరికాలోని హారీస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి సరదాగా డెలవేర్ లోని ఓ సరస్సులో బోటింగ్‌కు వెళ్లారు. సరస్సు మధ్యలో ఓ రాయిపైకి ఎక్కి ఫొటోలు దిగుతుండగా రూపక్, రాజీవ్ జారి పడిపోయారు.

తోటి స్నేహితులు రాజీవ్‌ను కాపాడినా రూపక్ ను మాత్రం రక్షించలేకపోయారు. మృతుడు 8 నెలల కిందటే అమెరికా వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news