కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..! వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

-

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వస్తున్నటువంటి ఊహాగానాలపై వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయని వైవి సుబ్బారెడ్డి గుర్తు చేశారు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరిన తమకి ఇలాంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు.

నెలరోజుల తర్వాత వైఎస్ విజయమ్మను కలవడానికి హైదరాబాద్ వెళుతున్నానని…. కనీసం జగన్ కుటుంబ సభ్యులను కూడా కల్వకూడదా అని వై.వి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. వైసిపి పార్టీ నుండి కొందరు వ్యక్తిగత కారణాలవల్ల వేరే పార్టీకి వెళ్తున్నారని ఎవరు ఏ పార్టీకి వెళ్లిన వైసిపికి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ వెంట ప్రజలు ఉన్నారని మళ్ళీ ఆయనే సీఎం అవుతారని అన్నారు. వైసిపి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జగన్ గెలిపిస్తాయని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news