ఏపీలో చర్చిలకు రూ.175 కోట్ల నిధులు.. ప్రతి నియోజకవర్గానికి రూ.కోటి కేటాయింపు

-

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్ణయ తీసుకుంది. చర్చిల నిర్మాణం, మరమ్మత్తులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు అందించనుంది. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున కేటాయించనుంది. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, స్మశాన వాటికల ఆధునికరణకు ఈ నిధులు వెచ్చించాలి.

జిల్లా కేంద్రాల్లో ఆదనంగా మరో కోటి విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్లు తెలిసింది. ఈ నిధుల్ని గ్రాంట్ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈనెల ఏడవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19 లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news