ఏపీలో 10వ తరగతి బాలిక పై అత్యాచారం…గర్భం రావడంతో !

-

ఎన్టీఅర్ జిల్లా నందిగామలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. చింతలపాడు గ్రామం లో 10 వతరగతి చదువుతున్న మల్లీశ్వరి అనే మైనర్ బాలిక ను కొంత కాలంగా బెదిరించి అత్యాచారం చేస్తున్నారు కూరగంటి మాణిక్యలరావు.

ఈ తరుణంలోనే.. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది ఈ సంఘటన. దీంతో బాలిక తల్లిదండ్రులు… మాణిక్యలరావును దేహశుద్ధి చేశారు. ఈ తరుణంలోనే.. స్వల్ప గాయాలతో నందిగామ ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కూరగంటి మాణిక్యలరావు.అనంతరం బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో కూరగంటి మాణిక్యలరావుపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన చందర్లపాడు పోలీసులు…విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news