వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేసిన యువకుడు..వీడియో వైరల్

-

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్వామి వివేకానంద కు ఘోర అవమానం జరిగింది. మద్యం మత్తులో స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి, ఉమ్మేస్తూ బూతులు తిడుతూ దాడి చేసాడు ఓ యువకుడు. ఈ సంఘటన శ్రీకాకుళం – పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది.

శ్రీకాకుళం – పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ పాఠశాల సిబ్బంది… గోప్యంగా ఉంచింది.

విగ్రహాన్ని ఎవరికీ కనబడకుండా ప్రభత్వ పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది దాచేసింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి విగ్రహ ధ్వంసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో జనసేన నాయకులు దాచేసిన విగ్రహాన్ని వెలికి తీసి అల్లరి మూకల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news