హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

-

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీస్ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

తాము నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని వారి తరపు న్యాయవాదులు వాదించారు. గతంలో ఉద్యోగుల వేతనాలకు సంబంధించి గవర్నర్ ను కలిశామని.. ఈ అంశంపై కూడా ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినట్లు గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం నోటీసును సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news