వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి బెజవాడ తూర్పు అధ్యక్షుడు..!

-

విజయవాడ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ ఇన్ చార్జుల మార్పులు, చేర్పులతో అసంతృప్త ఎమ్మెల్యేలు, నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సిట్టింగ్ లు స్థానంలోనూ కొత్త ఇన్ చార్జీలను నియమించడంతో ఆ పార్టీలో భారీ కుదుపు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా బెజవాడ తూర్పు వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవన కుమార్ ఆ పార్టీ నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ మేరకు సైకిల్ ఎక్కేందుకు లైన్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఇవాళ మంగళగిరిలో కలిశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కేశినేని చిన్ని సమక్షంలో నారా లోకేష్ తో భేటీ అయి సీటు విషయం పై చర్చించారు. త్వరలో తాను టీడీపీలో చేరతానని లోకేష్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మేరకు భవకుమార్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news