ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..ఫీజు చెల్లింపులపై ప్రకటన

-

ఏపీ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. ఫీజు చెల్లింపులపై ప్రకటన విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. మార్చి లేదా ఏప్రిల్ లో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజులను ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10 లోగా చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి తెలిపారు.

ఒక్క విద్యార్థి రూ.125 చెల్లించాల్సి ఉంటుందని, నిర్దేశించిన గడువులోగా ప్రధానోపాధ్యాయులు పరీక్షల విభాగానికి జమ చేయాలని సూచించారు. ఈ గడువు దాటితే, 11 నుంచి 20వ తేదీ లోపు రూ. 50, 21 నుంచి 25వ తేదీ లోపు రూ. 200, 26 నుంచి 30వ తేదీ లోగా రూ.500 అపరాధ రుసుముతో కలిపి ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఫీజులతో పాటు విద్యార్థుల రోల్ వివరాలను కూడా ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news