తెలుగు ప్రజలకు అలర్ట్..4 రోజుల పాటు వర్షాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి నాలుగు రోజులపాటు పిడుగులతో కూడిన పర్సనల్ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడప , అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.

మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని కోరింది వాతావరణ శాఖ. అయితే తీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేయడం తో ఏపీ ప్రజలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news