చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు – అంబటి

-

జీవో నంబర్ 1ను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకోం.. ఈ జీవో అందరికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. 23 సీట్లు సాధించిన వ్యక్తి 5 కోట్ల మంది ప్రజల తరఫున కుప్పం వెళ్లి ఎలా మాట్లాడతాడు? అని నిలదీశారు. చంద్రబాబు పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు కుప్పంలో జీవో 1ను పాటించటాన్ని తిరస్కరించారని.. చట్టాన్ని ఉల్లంఘించమని చెబుతున్నాడని మండిపడ్డారు.

జీవో 1 ప్రకారం రోడ్ల మీద బహిరంగ సభలు పెట్టకూడదని…నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే సభలు నిర్వహించాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండదా?? అని ఆగ్రహించారు. చంద్రబాబు తిరిగితే ఏమవుతుంది?? ఏమయ్యింది?? అని ప్రశ్నించారు. తిరిగిన తర్వాతేగా 23 స్థానాలకు పరిమితం అయ్యిందని.. కుప్పంలో జెడ్పీటీసీలు, ఎమ్పీటీసీలు గెలిచావా?? అని ప్రశ్నించారు.
నా కుప్పం…నా కుప్పం అంటూ చంద్రబాబు రంకెలు వేస్తున్నాడని.. ఆ కుప్పంలో ఇల్లు కాదు కదా ఓటు కూడా చంద్రబాబుకు ఎందుకు లేదు?? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news