అంబేద్కర్‌ విగ్రహం దగ్గర జగన్‌ పేరు సుత్తులతో పగలకొట్టారు – అంబటి

-

అంబేద్కర్‌ విగ్రహం దగ్గర జగన్‌ పేరు సుత్తులతో పగలకొట్టారు అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ…విజయవాడలో ప్రఖ్యాతి గాంచిన అంబేద్కర్ విగ్రహం వద్ద దాడి చేశారని ఆగ్రహించారు. శిలా ఫలకం మీద మాజీ సిఎం జగన్‌ పేరు లేకుండా చేయాలన్న కుట్ర తో అర్థరాత్రి సుత్తులతో పగల కొట్టారని ఆరోపణలు చేశారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగం లా లేదు..ఈ రాష్ట్రం లో అరాచక పాలన సాగుతుందన్నారు.

125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన మాజీ సిఎం జగన్ పేరు పగుల కొట్టడం దారుణమని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు,లోకేష్ ల ప్రమేయం తో నే ఈ ఘటన జరిగింది…పోలీసు పహారా ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద టిడిపి వాల్లే దాడి చేసి ఉంటారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ మీద నెహ్రూ పేరు ఉంటది…అలా అని దాన్ని పగల కొట్టేస్తామా అంటూ నిలదీశారు. ప్రభుత్వ కుట్ర కాక పొతే , వెంటనే జగన్ పేరుతో ఉన్న శిలాఫలకాన్ని పున ప్రతిష్ట చేపించాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news