వెన్నుపోటుదారులంటూ అంబటి… వ్యవహారం పీక్స్!

-

ఆంధ్రప్రదేశ్ లోని అధికార వైఎస్ఆర్సీపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం పార్టీలో మింగుడు పడటం లేదు. పార్టీని పొద్దస్తమానం దుమ్మెత్తిపోస్తూ మీడియాపై ఎక్కి కూర్చొని పార్టీని తూర్పారపట్టడం సుతరామూ నచ్చని వైసీపీ నేతలు రఘురామరాజుపై విరుచుకుపడుతున్నారు.

తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. ఎంపీ రాఘురామ కృష్ణంరాజుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. “అన్ని పార్టీల మాదిరిగానే మా పార్టీలో కూడా వెన్నుపోటుదారులు ఉంటారు.. తాజాగా మా పార్టీలో ఎంపీగా పోటీ చేసి గెలిచి.. ఆ తర్వాత మా పార్టీలోనే ఉంటు మా పార్టీనే నిరంతరం దుయ్యబడుతున్న ఆయన గారి నైజం తేటతెల్లమైంది.. అయినా మనకేం పర్వాలేదు.. వైఎస్ఆర్ జయంతి కార్యకర్తలు, నాయకులు ప్రజలంతా ఘనంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోండి.” అంటూ చెలరేగిపోయారు.

అదేవిధంగా.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధైర్యవంతుడైన కుమారుడుని లోకానికి ఇచ్చాడని.. పులిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని.. ఎంతమంది ఎన్ని అవాకులు చవాకులు పేల్చినా బెదిరే రకం కాదని స్పష్టం చేశారు. అలాగే… ప్రతిపక్ష నాయకుడికి ఓ కొడుకు ఉన్నాడు.. ఆ ప్రతిపక్ష నాయకుడు తన సొంత కొడుకును కూడా గెలిపించుకోలేకపోయిన రాజకీయ అనుభవం కలిగిన మేధావి అంటూ చలోక్తులతో కూడిన విసుర్లు విసిరారు అంబటి.

అంతేకాకండా మా పార్టీలోని ఎంపీ తమ పార్టీపై చేస్తున్న రచ్చను ఆసరాగా చేసుకొని పొందుతున్న కొన్ని మీడియా సునకానందం మాత్రం అంతా ఇంతా కాదని… అది తాను ఎప్పుడూ చూడలేదన్న విషయాన్ని కూడా అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ముఖ్యంగా దివంగత వైఎస్ఆర్ ను స్నేహితుడు అంటూ కొందరు వారి అబ్బాయి.. వైఎస్ జగన్ పాలనను చూసి తట్టుకోలేకపోతున్నారని.. వారికి ప్రజలు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తారని అంబటి రాంబాబు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news