కరోనా షాక్ : 2 వారాల చికిత్సకు 12 లక్షల బిల్లు.!

-

యాదగిరి గుట్టకు చెందిన 28 ఏళ్ల యువకుడు కరోనా కారణంగా నిన్న హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించాడు. జూన్ 23 న ఆసుపత్రిలో చేరిన ఆ యువకుడికి 24న కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా ఫలితం తేలింది. 26వ తేదీన మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దాదాపు 15 రోజుల పాటు అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడు. 2 వారాల్లో ఆ యువకుడి వైద్యం కోసం బాధిత కుటుంబం 6.50 లక్షలు చెల్లించింది.

అయితే నిన్న యువకుడి మృతి అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మొత్తం 12 లక్షలు అయిందంటూ బిల్లు చేతిలో పెట్టింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగటంతో చివరికి రూ. 20 వేలు కట్టించుకోని మృతదేహాన్ని అప్పగించగా.. ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news