రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగుతుంది.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగుతుంది.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మహానంది( మం) సీతారాంపురం గ్రామానికి చేరుకున్నారు మాజీ సీఎం జగన్. టీడీపీ నేత శ్రీనివాసరెడ్డిలో అతని అనుచరులు చేతుల్లో 3తేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు వైసీపీ నేత సుబ్బరాయుడు. సుబ్బరాయుడు భార్య సుబ్బమ్మ కొడుకులను పరామర్శించారు జగన్.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుంది.. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారు. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికి రైతు భరోసా అందేది అన్నారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version