TTD : 5వ చిరుతను బంధించిన అటవీ శాఖ అధికారులు

-

తిరుమల భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల అలిపిరి నడక మార్గంలో మరో చిరుత చిక్కింది. నరసింహస్వామి ఆలయం ఏడవ మైలు వద్ద ఇటీవల చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాల్లో గుర్తించిన… అక్కడే బోను ఏర్పాటు చేసి బంధించారు. నిన్న అర్ధరాత్రి అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

Another Leopard Trapped in Tirumala

గత రెండు నెలల కాలంలో మొత్తం ఐదు చిరుతలను అధికారులు బంధించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలకమండలి. ఇది ఇలా ఉండగా… గత నెలలో లక్షిత అనే చిన్నారిని చిరుత దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా నరసింహస్వామి ఆలయం సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో నిన్నటి నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు కర్రల పంపిణీ చేస్తోంది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version