ఏపీలోనూ త్రిపుర తరహాలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం – కేంద్ర మంత్రి అనురాగ్

-

ఏపీలోనూ త్రిపుర తరహాలో బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఏపీలో కూడా కమల వికాసం ఖాయమని.. త్రిపురలో ఒక్క సీటు లేకున్నా.. బీజేపీ జెండా ఎగరేసిందని తెలిపారు. పింగళి వెంకయ్య, అల్లూరి వంటి వారికి జన్మభూమికి కోటి కోటి ప్రణామాలు అని.. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత జగనుకు మద్దతిచ్చారని గుర్తు చేశారు.

ఇప్పుడు జగనుకు అదే యువత వ్యతిరేకంగా ఉందని.. YSRCP అంటే యువ సోషల్ రిప్లికా కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ పార్టీకి మరో రూపమే వైఎస్సార్సీపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియాలతో నడుస్తోన్న జగన్ ప్రభుత్వాన్ని క్షమించకూడదు.. సాఫ్ చేయాల్సిందేనని.. ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు.

అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారని.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలను దేశం విడిచి పెట్టి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఏపీలో కూడా ఢిల్లీ తరహాలోనే లిక్కర్ స్కాం జరుగుతోందని.. ఏపీలో గంజాయి మాఫియా వల్ల యువత ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు చేశారు. గంజాయి మాఫియా నుంచి యువతను కాపాడాలని జగన్ను చేతుల జోడించి వేడుకుంటున్నానని పేర్కొన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

Read more RELATED
Recommended to you

Latest news