బూమ్‌ రాంగ్: ఏపీ బీజేపీ నేతలకు వార్నింగ్!!

-

ఏపీలో బీజేపీ రాత్రికి రాత్రే రాజకీయంగా బలపడిపోవాలని తెగ ఉబలాటపడుతుంది. అందుకు వారికున్న ఏకైన మార్గం హిందుత్వ నినాదం అని ఫిక్సయిపోయినట్లుంది! కేవలం దేవాలయాల పరిరక్షణ, రధాల డిజైన్లు, డిక్లరేషన్స్ వంటి వాటిని నమ్మూకుని ఎదిపోవాలనే ఆలోచనలు బలంగా చేస్తున్నట్లుందనే కామెంట్లకు మరింత బలం చేకూరేలా జగన్ తిరుమల డిక్లరేషన్ వ్యవహారం జరిగింది. అయితే ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతల అత్యుత్సాహం వల్ల హస్తిన నుంచి ఫోన్స్ వచ్చాయనే చర్చ ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది!

అవును… ఏపీలో రాత్రికి రాత్రే రాజ‌కీయంగా బ‌ల‌ప‌డేందుకు తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ అనే ఆయుధం దొరికంద‌ని బ‌లంగా న‌మ్మిన ఏపీ బీజేపీ నేత‌లు… అధికారిక మితపక్షం జ‌న‌సేన, జనసేన అనధికారిక మిత్రపక్షం టీడీపీల‌తో క‌లిసి తిరుమ‌ల డిక్ల‌రేష‌న్‌ పై దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. అది కాస్త మోడీ భార్య గురించిన చర్చ మళ్లీ తెరపైకి రావడానికి కారణం అయ్యింది. ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలకు చివాట్లు పెట్టేవరకూ వచ్చిందని అంటున్నారు!!

తిరుమలలో జగ్న డిక్లరేషన్ అనేది ఒకరోజు ముచ్చట. తర్వాత వేరే వేరే విషయాలు వార్తల్లో నానుతుంటాయి. పైగా ఏపీ జనాలు జగన్ నుంచి కోరుకుంటున్నది డిక్లరేషన్స్ కాదు.. సరైన పరిపాలన. ఆ విషయంలో జగన్ కు ఫుల్ మార్కులే పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో “మోడీ భార్య” అనే టాపిక్ వచ్చేస్థాయిలో ఏపీ బీజేపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారని.

రాజకీయంగా ఎదగాలంటే మీరు మీరు పోరాడాలి కానీ… హస్తినలో ఉన్న పెద్దల పరువును అడ్డుపెట్టుకుని ఏపీలో బీజేపీ ఎదగడం కాదని.. ఎదగడానికి మరో మార్గం చూడాలని.. మరిన్ని మార్గాలు ఉంటాయన్న విషయం గ్రహించాలని… ఏఫీ బీజేపీ పెద్దలకు హస్తిన నుంచి వార్నింగ్ వచిందని అంటున్నారు! మరి ఈ విషయాలపై ఇప్పటికైనా ఏపీ బీజేపీ నేతలు సైలంట్ అవుతారా లేక… ప్రధాని, ఆయన భార్య టాపిక్ ఏపీ వాసులు మాట్లాడుకునేలా చేస్తారా అన్నది వేచి చూడాలి!! అడుసుతొక్కనేల.. కాలు కడగనేల!!

కాగా… ఈ విషయాలపై స్పందించిన కొడాలి నాని కూడా… బీజేపీ నాయకుల‌ మాటల వల్ల మోడీ గారి భార్య గురించి, శంకుస్థాపన గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news