సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

-

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న మంత్రి మండలి సమావేశం ఉంటుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో సమావేశం జరుగనుంది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించనుంది ఏపీ కేబినెట్.

కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మూడో రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.

 

Read more RELATED
Recommended to you

Latest news