AP : ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపై చర్చ

-

AP : ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి మండలి భేటీ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సీఎం జగన్ సన్నాహక సమావేశం జరుగనుంది. కేబినెట్ ముందుకు వచ్చే అంశాల పై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది. ఇక ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది.

AP Cabinet meeting on 14th of this month

కాగా, వైయస్సార్ లా నేస్తం రెండో విడత నిధులను ఇవాళ సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులు ఉన్నారు. వారికి నెలకు రూ. 5,000 చొప్పున 6 నెలల స్టైపెండ్ రూ. 30,000 జమ చేస్తారు. ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 7,98,95,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 రెండు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news