ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినేట్‌ సమావేశం

-

ఈ నెల 7వ తేదీన ఏపీ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈ తరుణంలోనే..క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాల పై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు చేయనున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సన్నాహక సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాల పై ముఖ్యమంత్రి జగన్ చర్చించనున్నారు.

ఇది ఇలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాల పై సీఎం జగన్ సమీక్ష ఇవాళ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగనుంది. మార్చి నెలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జీఐఎస్ నిర్వహించింది. విశాఖ కేంద్రంగా రెండు రోజుల పాటు జరిగింది జీఐఎస్. పెట్టుబడిదారులతో 13 లక్షల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. చేసుకున్న ఒప్పందాలు ఎంత మేరకు కార్యరూపం దాల్చాయి అన్న అంశాన్ని సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి జగన్.

Read more RELATED
Recommended to you

Latest news