నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఉద్యోగుల పెన్షన్ పై కీలక ప్రకటన

-

నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది.  ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. సచివాలయంలోని బ్యాక్-1లో సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఓవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం… మరోవైపు జగన్ వరుస ఢిల్లీ పర్యటనలతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత… చాలాకాలం నిరీక్షణ తర్వాత జరగనున్న ఈ భేటీలో ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపైనే చర్చిస్తారని తెలుస్తోంది. కొత్త పిఆర్సిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై చర్చించి… ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news