మంత్రుల సమర్థత మేరకు శాఖలు కేటాయింపు: చంద్రబాబు

-

మంత్రుల సమర్థత. అభీష్టం మేరకే శాఖలు కేటాయించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓఎస్డీలు, పీఏలు, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని మంత్రులకు చంద్రబాబు సూచించారు. శాఖలవారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజలముందు ఉంచుదామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రుల అభీష్టాలు, వారి సమర్థత మేరకు గురువారంలోగా శాఖలు కేటాయిస్తానని స్పష్టం చేశారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని తేల్చి చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news