నేడు ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల

-

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నారు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావుతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు తెలిపారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన విషయం తెలిసిందే.

మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.

మరోవైపు తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని కన్వీనర్‌ ఆచార్య మృణాళిని ఒక ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news