బేడీలు వేసి తీసుకెళ్ళిన అమరావతి రైతులకి బెయిల్

-

ఏపీ పోలీసులు ఏపీ ప్రభుత్వానికి బానిసల్లా మారి పని చేస్తున్నారని ఏపీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగానే వారి ప్రవర్తన కూడా ఉంటోంది. ఏపీలో వైసేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పోలీసులు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న తమ ఊరికి వచ్చి ఎవరో ధర్నలకి దిగుతున్నారని భావించిన కొందరు రైతులు వచ్చే వారిని అడ్డుకుంటే అడ్డుకున్నందుకు కేసులు పెట్టి మరీ జైలుకు పంపారు.

పంపితే పంపారు కానీ ఏకంగా వారికీ బేడీలు వేసి తీసుకు వెళ్ళడం సంచలనం రేపింది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని, పోలీసులని జాతీయ స్థాయిలో చాలా మంది ఏకి పడేశారు. తాజాగా అలా బేడీలు వేసి తీసుకు వెళ్ళిన రాజధాని రైతులకు బెయిల్ మంజూరు అయింది. జిల్లా జైలులో ఉన్న మంగళగిరి మండలం కృష్టాయ పాలెం రైతులకి ఈరోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news