ఏపీ ప్రభుత్వానికి మరో షాక్…

-

ఏపీ ప్రభుత్వానికి ఒకే రోజు మూడు షాక్ లు తగిలినట్టు అయింది. ఇప్పటికే అమరావతి తరలంపు మీద స్టేటస్ కో పెంచి షాక్ ఇవ్వగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు లీజ్ విషయంలో మరో షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలో అమ్మాలనుకున్న ఆరు స్థానాల్లో రెండు స్థలాల మీద స్టే ఇచ్చింది హైకోర్టు. చినగదిలి మండలంలోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్, 75 సెంట్లు , ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ ఒక ఎకరం స్థలంపై హైకోర్టు స్టే ఇచ్చింది.

అగనంపూడి లో ఉన్న స్థలం పైన కూడా కోర్టులో మరొకరు కేసు వేశారు. ఈ విషయం మీద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని కాపాడే బాధ్యత మాదని అన్నారు. వాటిని ప్రజావసరాలకు ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని, ఇలా ప్రజావ్యతిరేక విధానాలు ఏం చేసినా వాటిని కోర్టుల ద్వారా కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు చేస్తున్న జగన్ కి, ప్రశాంత్ కిషోర్ బ్రెయిన్ వాష్ చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news