ఏప్రిల్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు..త్వరలోనే షెడ్యూల్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 2021 -22 విద్యా సంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ మాసం లో జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అతి త్వరలోనే ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ ను ఫైనల్‌ చేయనున్నామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు స్పష్టం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలను మార్చి మాసంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి నియమ నిబంధనలను.. పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఇంటర్‌ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు తెలిపారు. కాగా… గత సంవత్సరం ఇంటర్‌ విద్యార్థులను పరీక్షల రాయ కుండానే.. పాస్‌ చేసింది ఇంటర్‌ బోర్డు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనే… ఇంటర్‌ విద్యార్థులను పాస్‌ చేసింది. అయితే.. ఈ సారి మాత్రం.. పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమౌవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news