ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ఠ్..సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ఇదే

-

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ఠ్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సెకండియర్ స్టూడెంట్స్ కి మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయి.

AP Inter Exams

మొదటి సంవత్సరం ఇంటర్ లో 3,46,393 మంది, సెకండ్ ఇయర్ లో 1,21,545 మంది విద్యార్థులు ఉన్నారు. వివరాలకు 08645-27702, 18004251531 నంబర్లలో సంప్రదించవచ్చు. అటు ఈ నెల 24 నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుండి జూన్ ఎనిమిదో తారీకు వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచనలు చేశారు అధికారులు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news