ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : సీపీఐ నేత రామకృష్ణ

-

ఆంధ్రప్రదేశ్ ని దగా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే అని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేసారు. మరోవైపు శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ద్రుష్టి సారించాలని సూచించారు. వర్షాలతో రాష్ట్రం మొత్తం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్న రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పై ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న ఇంటి దగ్గరకు దాడికి వెళ్లడం సరైన పద్దతి కాదన్నారు. గతంలో వైసీపీ ఇదే తరహా దాడులకు పాల్పడిందని విమర్శించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండి రాష్ట్రంలో ఇలాంటి దాడులు సరైనది కాదు అని హితవుపలికారు.

Read more RELATED
Recommended to you

Latest news