దేశంలో కేఏ పాల్ పార్టీకి కెసిఆర్ పార్టీ తేడా లేదు – విష్ణువర్థన్ రెడ్డి

-

దేశంలో కేఏ పాల్ పార్టీకి కెసిఆర్ పార్టీ తేడా లేదు… స్పష్టమ్తెన జాతీయ విధానం ప్రకటించకుండా జాతీయ పార్టీ పెట్టాడని ఫైర్ అయ్యారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. కెసిఆర్ దోచివేసిన సొమ్ముతో ఏపిలో ప్లెక్సీలు కడుతున్నారు… తెలుగుతల్లికి క్షమాపణ చెప్పి ఏపిలోకి కెసిఆర్ అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఎందరో మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు.

వీరి కుటుంబాలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణా తల్లిని కర్నాటక , మహారాష్ట్ర , యూపీ , తమిళనాడు,ఏపీకి ఎలా తెస్తారో చెప్పాలి… దేశాన్ని ఏకం చేసే కెసిఆర్ ఏపిలో నీటి ప్రాజెక్టులప్తె తన వ్తెఖరిని ప్రకటించాలని పేర్కొన్నారు. ఏపితోనే వివాదాలు ఉన్న కెసిఆర్ జాతీయ స్థాయిలో మిగిలిన పార్టీలను ఎలా మెప్పిస్తారు…ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల గణాంకాలకు , భారత ప్రభుత్వం గణాంకాలను పొంతన లేదని విమర్శించారు. 12 నెలల్లో చేయాల్సిన అప్పులను ఏపి ప్రభుత్వం 6 నెలల్లో చేస్తోందన్నారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news