టీడీపీ అరాచకాలు…మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్‌కు క్షమాపణలు !

-

ఏపీలో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లు ఎక్కడా ఆగడం లేదు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారు. అయితే.. తాజాగా టీడీపీ అరాచకాలు మితిమీరాయి. ఈ తరుణంలోనే… మోకాళ్లపై కూర్చోబెట్టి నారా లోకేష్‌కు క్షమాపణలు చెప్పించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.

Apologies to Lokesh on his knees

వైసీపీకి నాయకురాలు పాలేటి కృష్ణవేణి, భర్త రాజ్ కుమార్ పై దాడికి పాల్పడ్డారు. అతని చొక్కా విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ పోస్టర్ ముందు ఆయన కాళ్ళు పట్టించి క్షమాపణలు చెప్పించారు. అలాగే టీడీపీ నేతల కాళ్ళు సైతం పట్టించుకున్నారు. మరోసారి లోకేష్ పై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ పరుష పదజాలంతో మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news