తిరుపతిలో పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్న జనసేన నేతలు..

-

జనసేన పార్టీలో అంత్యర్యుద్దం మొదలైంది. మూడు పార్టీలో పొత్తు నేపథ్యంలో జనసేన నేతలు..తిరుపతిలో పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలు ధిక్కరించి మరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కిరణ్ రాయల్. హోటల్ ఉదయ్ ఇంటర్నేషనల్ లో స్దానిక జనశ్రేణులతో కిరణ్ రాయల్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

Arrangement of Kiran Royal intimate meeting with people

ఇదే సమయంలో జనసేన అభ్యర్థి ఆరిణి శ్రీనివాసులు ఎన్ జీవో ఆఫీస్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్దివైపే మెజారిటీ నేతలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక జనసేన పార్టీ ఆదేశాలు ప్రకారం తాము నడుస్తామంటున్నారు తిరుపతి నగర కేడర్. ఆరిణి శ్రీనివాసులు మాతో కలవలేదని అందుకే సమావేశం అంటున్నారు కిరణ్ రాయల్. పలుమార్లు ఆరిణి కలవడానికి ప్రయత్నించిన స్పందించకుండా ఉన్నారట కిరణ్ రాయల్…సహా పలుపురు నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news