చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం – అశోక్‌ బాబు

-

4వ తేది తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం….చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయం అన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారు..? ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటన చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్ పై వేసిన అప్పీల్లో తోక ముడిచిన వైసీపీ పార్టీ… తాము ఓడిపోయినా నిసిగ్గుగా ఎలక్షన్ కమిషన్ పై వైసీపీ విషం కక్కుతోందని ఆగ్రహించారు.

ashok babu on chandrababu

కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణను యధాతథంగా ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల అధికారి చర్యలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. హైకోర్టులో వారి వాదనలను వెనక్కి తీసుకొన్న వైసీపీ….పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని ఫైర్‌ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ అధికారి సంతకం తో పాటు స్టాంప్ ఉండాలన్న నిబంధన లేదు….ఈసీ ఎదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయి అనే వాదన అసంబద్ధం అన్నారు. సీఈఓ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా చేసినట్లు చెప్పుకుంటున్నారు….వైసీపీ ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్స్ తయారు చేస్తున్నారని ఆగ్రహించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news